हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telangana: తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

Sharanya
Telangana: తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పరీక్షల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని, విద్యార్థులకు అనుకూలంగా ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

students board 1024x569

పరీక్షా కేంద్రాల్లో భద్రతా చర్యలు

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల పాటు మాత్రమే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. అంతేకాదు, ఏదైనా అనుకోని సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు డీఈఓ (జిల్లా విద్యాశాఖ అధికారి), ఎంఈఓ (మండల విద్యాశాఖ అధికారి), తహసీల్దారు ఫోన్ నంబర్లు పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అధికారులకు సమాచారాన్ని తెలియజేయవచ్చు. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల కోసం కొత్తగా 24 పేజీల బుక్‌లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు సమాధానాలను ఈ బుక్‌లెట్‌లోనే రాయాలి. ప్రత్యేకంగా అదనపు పేజీలు ఇవ్వకపోవడం వల్ల సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 నాటికి పూర్తికానున్నాయి. తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు అన్ని సూచనలను పాటించి, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారుల సూచనలు అందించారు. విద్యార్థులకు ఈ పరీక్షలు కీలకమైనవి కావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిపై మానసిక ఒత్తిడిని పెంచకుండా ప్రోత్సహించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షల అనంతరం జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమై, పరీక్ష ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870