Telangana Ration card: తెలంగాణ వ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకం విజయవంతంగా అమలవుతున్నదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ముఖ్యంగా బొగ్గు గని కార్మికులు, థర్మల్ విద్యుత్ కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందే వెసులుబాటు కలిగిందని పేర్కొంది.
Read Also: Telangana: పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ

బుధవారం పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖితపూర్వక దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ డిజిటల్ రేషన్ విధానం వల్ల లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా తమకు కావలసిన సరుకులను పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మొత్తం 410 చౌక ధరల దుకాణాలు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: