Telangana: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) మంత్రి సీతక (Minister Sitaka) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వరకు ఆదాయ పెంపుదల మార్గాల కార్యక్రమం చేపట్టాలని, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు తాగునీటిపై, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వెలువడే చెత్తసేకరణ కార్యక్రమాలు, మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులు, 16 నుంచి 31 వరకు వానకాలం సంసిద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
గురువారం ఆమె జిల్లా సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.
Read Also: Pollution: కాలుష్య కాసారంలో నగరాలు!

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: