తెలంగాణలోని(Telangana MunicipalElections) 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మున్సిపాలిటీల్లో ఆధిక్యం సాధిస్తూ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుండగా, బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది.
Read Also:Kalwakurthy Results: ‘ఒక్క ఓటు’ తేడాతో కాంగ్రెస్ విజయం

9 మున్సిపాలిటీల్లో హంగ్.. స్వతంత్రులే కీలకం
ఇప్పటివరకు 9 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్ పట్టణాల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించనున్నారు. అదనంగా, ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్నట్లు సమాచారం.
జనగామ మున్సిపాలిటీపై ఉత్కంఠ.. వార్డుల వారీగా ఫలితాలు
జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్(Telangana MunicipalElections) 13 వార్డుల్లో, కాంగ్రెస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రుల మద్దతు కీలకం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందడం విశేషంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: