Telangana: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది.
Read Also: Mulugu Crime: ములుగు జిల్లాలో దారుణం: బాలికపై సర్పంచ్ భర్త అఘాయిత్యం
స్పీకర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం వెల్లడించారని, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తయిందని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందిన ధర్మాసనం, స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున ఈ కేసును మూసివేస్తున్నట్లు తెలిపింది.
పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారని.. వాటిపై తగిన నిర్ణయం తీసుకుని.. ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన విషయాన్ని లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కార్యాలయం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఏకీభవించింది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని.. తన తీర్పును వెలువరించినందున.. ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీలను.. ఫిర్యాదుదారులకు 2 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: