हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత

Sudheer
తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత, ప్రభుత్వ హామీల అమలు అంశాల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ఆమె విమర్శించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సొంత లాభాల కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణ పరిస్థితుల్లో ఉంది. ప్రతి మూడు గంటలకోసారి లైంగిక దాడి జరుగుతుండటం బాధాకరం” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్టపాలనతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రగతిశీల తెలంగాణ కోసం కేసీఆర్ శ్రమించి సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు నాశనం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా, వారి నమ్మకాలను ద్రోహం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించిన కవిత, “కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ తీరుపై ప్రశ్నించాలని, వారికి బదులు చెప్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. కాంగ్రెస్ హామీలను గాలికొదిలేసి, ప్రజల నమ్మకాన్ని వంచిస్తున్నారు. ప్రజలు తక్షణమే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి అని ఆమె పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870