हिन्दी | Epaper

Telangana: ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం పాఠాలు

Sharanya
Telangana: ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం పాఠాలు

తెలంగాణ (Telangana) విద్యా రంగంలో ఓ సానుకూలమైన మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సంగీతాన్ని కూడా అభ్యసించే అవకాశాన్ని పొందనున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (PM SHRI) పథకం కింద రాష్ట్రంలోని పలు పాఠశాలలు కొత్త దిశలో పయనించనున్నాయి.

PM SHRI పథకం – సంగీత విద్యకు బాట

ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 794 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యవిషయాలతో పాటు సంగీత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

విద్యా వాతావరణాన్ని మెరుగుపరచే ప్రణాళిక

దీనిలో భాగంగా ఒక్కో పాఠశాలకు ఐదేళ్లలో రూ.కోటి నుంచి రూ.2.25 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, క్రీడా సామగ్రి అందజేశారు. తాజాగా 270 హైస్కూల్​లకు సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ పరికరాలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (టీజీటీఎస్‌) టెండర్ల ద్వారా సరఫరా చేసింది.

సంగీత ఉపాధ్యాయుల నియామకంపై ఇంకా స్పష్టత లేదు

అయితే సంగీత పాఠాలు నేర్పే టీచర్ల నియామకంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పాఠశాలకో టీచర్‌ను నియమించడానికి నెలకు రూ.10 వేల చొప్పున 6 నెలలకు రూ.60 వేలు కేటాయించారు. అయితే వాయిద్యాలను నేర్పించడానికి ప్రత్యేక టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించి, కార్యాచరణ రూపొందించేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

Read also: Amit Shah: అమిత్ షా చేతుల మీదుగా నేడు తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870