(Telangana) మేడారం జాతరలో చోటుచేసుకున్న ఒక ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని లక్ష్యంగా చేసుకుని కొందరు యూట్యూబర్లు వేధించారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ Asaduddin Owaisi అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: Revanth Comments: ‘నేనే రాజు, నేనే మంత్రి’ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ
మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలు ఆపాలి
శుభ్రత లేకుండా తయారు చేస్తున్నాడని.. వాటికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఆయన ఖండించారు. కుటుంబాన్ని పోషించేందుకు జాతరలో వ్యాపారం చేసుకుంటే.. అతనికి మతరంగు పులమడం అన్యాయం అని పేర్కొన్నారు.ఒక వ్యక్తి పొట్టకూటి కోసం కష్టపడుతుంటే.. ఇలా వీడియోలు తీసి.. అతడిని ఇబ్బంది పెట్టడం వల్ల అతడి కుటుంబం మాత్రమే కాదని.. లక్షలాది చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ నాణ్యత లేకుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ.. సోషల్ మీడియాలో వీడియోలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకని నిలదీశారు.

నిజంగా ఆ వ్యక్తి అపరిశుభ్రంగా కోవా బన్ తయారు చేస్తే.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు ఫిర్యాదు చేయాలి కానీ.. కానీ లైక్లు, వ్యూస్ కోసం ఇలా సోషల్ మీడియాలో మత విద్వేషాలను వ్యాప్తి చేయడం సమాజానికి మంచిది కాదని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుదారి పట్టించే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులే లక్ష్యంగా మత విద్వేషాలు పెంచే ప్రయత్నాలను ఆపాలని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: