हिन्दी | Epaper

Summer: అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు

Anusha
Summer: అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు

రానున్న వేసవి (Summer) కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాల పట్ల నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని, ముఖ్యంగా వేసవిలో నిప్పుతో ఊహించని ప్రమాదం పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రతిఒక్కరూ అగ్నిమాపక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఓ అవగాహనా కార్యక్రమంలో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, “కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

Read Also: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!

ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా తీసుకోవాల్సిన అంశం

అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే పరిస్థితి మన చేతుల్లో ఉండదు. నగరంలో గతంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను విశ్లేషిస్తే, ఎక్కువగా నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి” అని స్పష్టం చేశారు. అగ్నిమాపక భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా తీసుకోవాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో హైడ్రా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని కమిషనర్ వివరించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలను , తప్పకుండా పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలమని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

HYDRA Ranganath: వరద ముప్పులేని నగరం కావాలి.. | HYDRA Commissioner Ranganath  Goal Is a Flood Free Hyderabad ksv
Summer: Hydra awareness programs on fire hazards

త‌ర‌చూ జ‌రుగుతున్న అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి నెలాఖ‌రులో త‌నిఖీలు చేప‌ట్టి 9 షాపుల‌ను సీజ్ చేసిన‌ట్టు గుర్తు చేశారు. ప‌లు వ్యాపార సంఘాల విన‌తుల మేర‌కు ఒక నెల రోజులు స‌మ‌యం ఇచ్చామ‌ని.. మార్చి నెల రెండో వారం నుంచి త‌నిఖీలు ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఆయా వ్యాపార స‌ముదాయాల‌ను, షాపుల‌ను సీజ్ చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో హైడ్రా త‌నిఖీలు చేయ‌డం, నిబంధ‌న‌లు పాటించ‌ని వ్యాపార సుముదాయాల‌ను సీజ్ చేయడాన్ని వేధించ‌డంగా భావించ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని వ్యాపార‌ సంఘాల ప్ర‌తినిధులతో పాటు.. పౌరుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు హైడ్రా పెద్ద పీట వేస్తుంద‌న్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870