KCR phone tapping case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత **కేసీఆర్**కు నోటీసులు జారీ చేయడానికి సిట్ అధికారులు నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచిస్తూ నోటీసులు అందజేసినట్లు సమాచారం.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
వయస్సు దృష్ట్యా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు కేసీఆర్కు తెలిపారు. ఆయనకు అనుకూలమైన ప్రదేశంలోనే విచారణ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ **సంతోష్ రావు**లను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: