డాక్టర్ కావాలనే కలతో ముందుకు సాగుతున్న ఓ పేద టైలర్ కుమార్తె జీవితానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. లక్షల్లో ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఆ విద్యార్థిని చదువు ఆగిపోకుండా చేయడానికి, తన సొంత ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 లక్షల విద్యా రుణం ఇప్పించడం ద్వారా హరీశ్ రావు మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలో అవసరమైన చోట తానున్నానని నిరూపించారు.
Read also: Special Trains: సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు
ఓ పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను
సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తితో కుటుంబాన్ని పోషిస్తూ కుమార్తె మమతను చదివించారు. మమత కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి, తాజాగా పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఆప్తమాలజీ సీటు దక్కినా, కన్వీనర్ కోటాలో ఏటా రూ.7.50 లక్షల చొప్పున మూడు సంవత్సరాల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్తులు లేకపోవడంతో బ్యాంకులు రుణానికి నిరాకరించగా, ఈ నెల 18లోగా ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే ప్రమాదం నెలకొంది.
సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు
ఈ విషయం తెలుసుకున్న హరీశ్ రావు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్పందించారు. సిద్దిపేటలోని తన స్వంత నివాసాన్ని యూనియన్ బ్యాంకులో మార్టిగేజ్ చేసి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఖర్చుల కోసం అప్పు చేయవద్దని సూచిస్తూ, తన సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు అందజేశారు. గతంలోనూ ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇలాగే తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీశ్ రావు, ఈసారి ఓ పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: