Latest News: Shamshabad: 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం

Read Time:  1 min
Shamshabad
Shamshabad
FONT SIZE
GET APP

రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్, రాయికుంట గ్రామాల్లో 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఎస్ఐసీ కేంద్ర కార్యాలయంలో 197వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఆమోదం కూడా ఈ సమావేశంలో పొందారు.

హైదరాబాద్(Hyderabad) సనత్‌నగర్‌లో ఇప్పటికే ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుచేసి, ఇన్స్యూరెన్స్ కలిగిన కార్మికులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలను అందిస్తోంది. దీని తోడుగా, నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ ప్రాంతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసుపత్రులు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సేవలు అందిస్తున్నాయి. శంషాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఆసుపత్రి కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకొని, దగ్గర ప్రాంతాల్లోని కార్మికులకు, వారి కుటుంబాలకు సౌకర్యవంతమైన వైద్యసేవలను అందిస్తుంది.

Read also: Vamshi Krishna: సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రకు తరలించడం రాజకీయ కుట్ర

Shamshabad
Shamshabad The Centre has approved a 100-bed ESIC hospital.

కార్మికులకు సమీపంలో వైద్యసేవల సౌకర్యం

ప్రస్తుతంగా రంగారెడ్డి జిల్లాలో 1.32 లక్షలకు పైగా కార్మికులు ఈఎస్ఐ ఇన్స్యూరెన్స్ కలిగి ఉన్నారు. శంషాబాద్(Shamshabad) ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో కార్మికుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా. కొత్త ఆసుపత్రి నిర్మాణం ద్వారా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అవసరమైన వైద్యసేవలను సమీపంలోనే పొందగలుగుతారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత, రంగారెడ్డి జిల్లాలోని కార్మికులకు ఆరోగ్య పరిరక్షణలో మరింత సౌలభ్యం ఏర్పడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.