నేడు వనపర్తిలో జరిగిన ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఎలాంటి సహాయం చేయాలని అనుకుంటున్నా, కిషన్ రెడ్డి మాత్రం సైంధవుడిలా అడ్డంకిగా మారారని’ ఆరోపించారు. అంతేకాదు కిషన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో తన రహస్య మిత్రుడిని ప్రభుత్వం నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారని కూడా విమర్శించారు.ఈ సందర్భంగా, వరంగల్ ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ ను ప్రధాని మోదీ ఇచ్చారని, కానీ ఈ ప్రాజెక్టును తనవంటిది చేసుకున్నట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రశ్నలు సంధించారు
అందువల్ల ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకోవాలని తపించే కిషన్ రెడ్డి వ్యవహారం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రశ్నలు సంధించారు. మెట్రో ప్రాజెక్టు ఎందుకు రాలేదు మూసీ ప్రక్షాళన కోసం నిధులు ఎందుకు రాలేదు? ఆ ప్రాజెక్టులను ఆపడం ఎవరి వల్ల జరిగిందో చెప్పండి అంటూ ఆయన ప్రశ్నించారు. దానికి తోడు, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరైందని కిషన్ రెడ్డి చెబుతున్నారు, కానీ దక్షిణభాగం ఎందుకు ఆగిపోయింది పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీ నీరు రావాల్సి ఉండగా, ఎందుకు పదేళ్ల పాటు పెండింగ్ లో ఉంది?
కిషన్ రెడ్డి తనకు కంటే చిన్నవాడు సీఎం అయిపోవడం మీద అసహనం
ఈ ప్రాజెక్టును ఆపింది ఎవరు అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు.రేవంత్ రెడ్డి మరింత వివరణ ఇస్తూ, ఏదైనా ప్రాజెక్టు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటారు, కానీ అది రాకపోతే, రేవంత్ రెడ్డిని దోషిగా చూపిస్తారని ఆరోపించారు. కిషన్ రెడ్డి తనకు కంటే చిన్నవాడు సీఎం అయిపోవడం మీద అసహనం చూపిస్తుండడం ఏంటో? ఆయనకు కడుపు నొప్పి వస్తోందని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కిషన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ ప్రతిభను రేవంత్ రెడ్డి ఖండించడంతో ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. Telangana రాజకీయాల్లో తాజా పరిణామాలు మరింత వేడెక్కుతుండడంతో, ఈ విమర్శలతో కిషన్ రెడ్డి ఎదురు దాడులకు రెడీ అయ్యారా అనేది వేచి చూడాల్సిన విషయం.