RBI Governor meeting : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గవర్నర్, జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రస్తావించారు. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయని ఆయన వివరించారు.
Latest news: Mumbai Rent Crisis: ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్
ఈ సందర్భంగా, అనియంత్రిత డిపాజిట్ స్కీమ్స్ను అడ్డుకునే బడ్స్ చట్టాన్ని (BUDS Act) రాష్ట్రంలో త్వరగా నోటిఫై చేయాలని (RBI Governor meeting) ఆర్బీఐ గవర్నర్ ముఖ్యమంత్రిని కోరారు. అలాగే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (ULI), ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతున్నందున, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కొంతకాలం పాటు తక్కువ స్థాయిలో కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదిరితే దేశ ఆర్థిక వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలను మించవచ్చని, ముఖ్యంగా అమెరికాతో ఒప్పందం వల్ల వృద్ధి రేటు సగం శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :