हिन्दी | Epaper
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Revanth Reddy: నేడు ఢిల్లీ కి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Sharanya
Revanth Reddy: నేడు ఢిల్లీ కి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన అనంతరం రేవంత్ ఢిల్లీ (Delhi) కి వెళ్లడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేంద్రంతో కీలక చర్చలు

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రధాన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమై ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. (discuss with Union Ministers) ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ (Revanth Reddy) కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత ఉండటంతో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు.

రేషన్ కార్డుల పంపిణీ – రాహుల్, ప్రియాంక ఆహ్వానం

రాష్ట్రంలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం.

మహిళా శక్తి సంబరాలు – రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు

ఈ నెల 12 నుంచి 18వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు సీఎం రేవంత్.

Read hindi news: hindi.vaartha.com

Read also: KU Graduation Ceremony : నేడు కేయూ స్నాతకోత్సవం.. గవర్నర్ రాక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870