हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Retired employees: రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి తాజా ప్రకటన

Sharanya
Retired employees: రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి తాజా ప్రకటన

తెలంగాణలో పదవీ విరమణ అనంతరం వివిధ విభాగాల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనా? లేక ఇందులో దాగున్న ఆంతర్యం వేరే ఉందా? అనే అంశంపై అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉత్తర్వుల వెనుక వ్యూహం?

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో 6,729 మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా వివిధ విభాగాల్లో ఎక్స్‌టెన్షన్, రీఅపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో కొనసాగుతున్నారు. వీరిలో IAS స్థాయి ఉన్నతాధికారుల నుంచి, అటెండర్ల వరకు ఉద్యోగులు ఉన్నారు. సీఎస్ శాంతికుమారి ఇటీవల అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ నెల 31లోగా వారిని తొలగించాలని ఆదేశించారు. అయితే, ఈ ఉత్తర్వులోనే ఒక చిన్న మినహాయింపు ఇచ్చారు. ఏదైనా శాఖలో విశ్రాంత అధికారి సేవలు అత్యవసరం అనుకుంటే, ఆ శాఖ అధిపతి జస్టిఫికేషన్ ఇస్తే, ప్రభుత్వం తిరిగి నిర్ణయం తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ వెసులుబాటుతో కొన్ని కీలకమైన నియామకాల విషయంలో ప్రభుత్వం తనకు అనుకూల అధికారులను కొనసాగించేందుకు అవకాశముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్స్‌టెన్షన్‌కు అడ్డుకట్ట లేదా ప్రత్యామ్నాయం?

ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్ విధానానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నా, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, మంత్రుల కార్యాలయాలు, కీలక బోర్డుల్లో పనిచేస్తున్న అధికారులకు మినహాయింపు ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఒక్క వెసులుబాటు ద్వారా కాంగ్రెస్‌ సర్కారు తమకు అనుకూల అధికారులను మళ్లీ యథాస్థానంలో కూర్చోబెట్టే అవకాశమున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సత్యనారాయణ, గనుల శాఖ అధికారి సుశీల్ కుమార్ వంటి ప్రముఖుల కొనసాగింపుపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తొలగింపుతో యువతకు ఉద్యోగ అవకాశాలు?

నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, విశ్రాంత ఉద్యోగుల తొలగింపు ద్వారా యువతకు కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క విశ్రాంత అధికారికి చెల్లించే భారీ వేతనంతో నలుగురు కొత్త ఉద్యోగులను నియమించవచ్చు అని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక నిజమైన ఉద్దేశం ఏంటి? రాజకీయ వ్యూహాలేనా? లేదా నిజంగా ఆర్థిక పరంగా ఉత్తమ నిర్ణయమా? అనే అంశంపై సమయం వచ్చే వరకు స్పష్టత రాదు. అయితే, తెలంగాణలో కొత్త ప్రభుత్వ విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే నిర్ణయాల్లో ఇదొకటి అనేది స్పష్టమే. వివిధ శాఖల్లో కొనసాగుతున్న చాలా మంది రిటైర్డ్‌ అధికారులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. అలా ఒక్కరికి చెల్లించే వేతనంతో నలుగురు కొత్త ఉద్యోగులను ఆ శాఖలోకి ఎలాంటి ఆర్థికభారం లేకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరించి, విశ్రాంత ఉద్యోగులు అందరినీ తొలగించి యువతకు కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులోనే వెసులుబాటు ఇచ్చారని సచివాలయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870