हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Big Relief : KTRకు హైకోర్టులో ఊరట

Sudheer
Big Relief : KTRకు హైకోర్టులో ఊరట

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఓ ఘటనలో, మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసిందని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో, ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

న్యాయపరంగా సరైన ఆధారాలు లేవు

KTR చేసిన ఆరోపణలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయంటూ సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు న్యాయపరంగా సరైన ఆధారాలపై ఆధారపడలేదని, వ్యక్తిగత విమర్శల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయపరంగా అన్యాయం అని KTR తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిని పరిశీలించిన హైకోర్టు, ఈ కేసులో ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాలు ఫిర్యాదు కోణానికి సరిపోవడం లేదని స్పష్టం చేసి ఎఫ్ఐఆర్‌ను కొట్టేసింది.

బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు

ఈ తీర్పుతో KTR‌కు పెద్ద ఊరట లభించింది. రాజకీయ విమర్శలను వ్యక్తిగత దూషణలుగా అభివర్ణించడం సరికాదని, విమర్శలకు ప్రతిస్పందన రాజకీయ పరిధిలో ఉండాలంటూ న్యాయస్థానం సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870