తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: Surabhi Medical College Suicide: సురభి మెడికల్ కాలేజీలో మెడికో శ్రీజ ఆత్మహత్య

తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: