Congress meeting : లోక్సభ ప్రతిపక్ష నేత Rahul Gandhi తాను ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా Ananthagiri Hills లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలు మరియు దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతం అహింస, ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడిందని, కానీ బీజేపీ రాజకీయాలు విభజన, హింస వైఖరిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, కాంగ్రెస్కు మాత్రం ప్రజాసేవ ప్రధానమని అన్నారు.
ప్రధాని Narendra Modi అమెరికా అధ్యక్షుడు Donald Trump ముందు బలహీనంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశ ప్రయోజనాల విషయంలో ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు Y. S. Sharmila సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంపై కూడా చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: