हिन्दी | Epaper

R. Krishnaiah: కోర్టు కేసు తేలకుండా మున్సిపల్ ఎన్నికలకు ఎలా వెళతారు?

Tejaswini Y
R. Krishnaiah: కోర్టు కేసు తేలకుండా మున్సిపల్ ఎన్నికలకు ఎలా వెళతారు?

42% బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు దగా

హైదరాబాద్ : కోర్టు కేసు తేలకుండా మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 42శాతం బి.సి రిజర్వేషన్(BC Reservation) ఇవ్వకుండా ఎన్నికలు జరుపడం బీసీలను దగా చేయడమే అవుతుందని, స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచిన కేసు హైకోర్టును నడుస్తుంది. గత నవంబర్ లో హైకోర్టులో ఫుల్ బెంచ్ మీదకు రావలసిన కేసు ఇంతవరకు కోర్టు బెంచ్ కూడా రాకుండా వాదించకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.

Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్

R. Krishnaiah: How can they go to municipal elections without a court case being resolved?
R. Krishnaiah: How can they go to municipal elections without a court case being resolved?

ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు

బీసీ బంద్ తర్వాత రాజకీయ పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలని బీసీలకు అన్యాయం చేయడానికి సాహసం చేయడం లేదని అన్నారు. దీనిపై “స్టె” ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిపే సమయంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే 3000 కోట్లు గ్రాంట్ రాదని అందుకు ఎన్ని కలు జరపాలని జరిపారన్నారు. ఎందుకు మున్సి పల్ ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు తొందర. కోర్టు కేసు న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా బలంగా ఉంది. ఎన్ని కోణాల్లో చూసిన కేసు గెలుస్తుంది. గెలిపించడానికి సర్వశక్తులు ఓడిపోరాడుతున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం కేసు గెలిపించడానికి గట్టిగా ప్రయత్నం చేయకుండా ఎన్నికలకు తొందరపడడం దేనికి? కోర్టులో బీసీల కేసు అంటే ఓడిపోతుంది. కొట్టివేస్తారు. అనేది ఒక ఫ్యాషన్ గా తయారయిందన్నారు.

రాజ్యాంగం రాష్ట్రానికి అధికారం ఇచ్చింది

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డిజి టిసి ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది. దీనికి రాజ్యాంగ బద్ధతయుంది. అలాగే చట్టబద్ధత కల్పించారు. కావున అసెంబ్లీ చట్టం చేశారు. 50 శాతం సీలింగ్ను న్యాయపరమైన వాటిని అధిగామిం చామని, బీసీలు కేసులు గెలిచే అవకాశం ఉం దని, చట్ట ప్రకారం, న్యాయప్రకారం రాజ్యాం గపరమైన అవరోధాలు లేనందున జనాభా లెక్క లు ఉన్నప్పటికీ కోర్టులో కేసు గెలుస్తుందని అన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారన్నారు. కేసు గెలవాలి. న్యాయం ముందు ఎలా గెలవదో చూస్తామని హెచ్చరించారు. బీసీల జీవితాలతో బీసీ ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుతుంది. ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణా మాలు జరుగుతాయని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870