బీసీలకు 42శాతం రిజర్వేషన్ ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. దీంతో స్థానిక సంస్థలకు (Local elections) త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
accenture-layoffs-11000 : 11,000 మంది తొలగింపు, AI ప్రభావం, కంపెనీ స్పందన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్ భగవత్, పంచాయితీరాజ్ సెక్రటరీ శ్రీధర్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తదితరులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలి? మొత్తం ఎన్ని దశలో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైచర్చించినట్లు సమాచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల (42 percent reservation for BCs) అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మార్గం సుగమమైంది.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: