మెదక్ జిల్లా కొల్చారం (Kolcharam, Medak district) మండలంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అంసానిపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల (Between two brothers) మధ్య తగాదా చివరకు హత్యకు దారి తీసింది. రమావత్ మంగ్త్య, రమావత్ మోహన్ అన్నదమ్ములు. భూముల వివాదంతో పాటు ట్రాక్టర్ అద్దె విషయంలో వారిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి.శుక్రవారం ఉదయం స్థానిక కల్లు దుకాణంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు మోహన్ ఆకతాయి చర్యకు పాల్పడ్డాడు. గాజు సీసాను పగులగొట్టి అన్న మంగ్త్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మంగ్త్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

మర్మాంగాలపై దాడి – మెడకు టవల్ చుట్టి హింస
మంగ్త్యను కింద పడేసిన మోహన్, రాయితో మర్మ స్థానాలపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతని మెడకు టవల్ చుట్టి బిగించాడు. ఇదంతా పక్కన నిల్చున్నవారు చూడడంతో సరిపెట్టారు. అక్కడి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసినా ఆపేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.విషయం తెలిసిన వెంటనే మంగ్త్య భార్య సంతు అక్కడకు చేరుకుంది. కుటుంబ సభ్యులు మంగ్త్యను 108 అంబులెన్స్లో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్టు ధృవీకరించారు.
పోలీసుల విచారణ ప్రారంభం – నిందితుడు పరారీలో ఉన్న?
సంఘటన స్థలానికి కొల్చారం ఎస్సై, మెదక్ రూరల్ సీఐ చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఘటన చూస్తూ ఫోన్లో వీడియోలు తీయడం గానీ, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గానీ, స్థానికుల్లోని సామాజిక బాధ్యతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒక ప్రాణం పోతున్నా స్పందించకపోవడం నిఖార్సైన నిర్లక్ష్యమే.
Read Also : Trump: ఎయిడ్స్పై ట్రంప్ గట్టి నిర్ణయం – కోటి ప్రజల జీవితాలపై ప్రభావం