ఇందల్వాయిలో బోల్తాపడిన బస్సు
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళుతున్న ప్రైవే టు బస్సు ఒక మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులు దుర్మణం చెందారు. నిజామాబాద్ లోని ఇందల్వా యి మండలం గన్నారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణీకులు వున్నారు. వీరంతా హైదరాబాద్ నుం చి వివాహం కోసం అకోలాకు వెళుతున్నారు. మరణించిన వారిలో మంజూషా (29) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు రిషి (7), అబ్బాస్ (22 ), ఇంకో వ్యక్తి వున్నాడు. ఇదే ఘటనలో మరో 15 మంది గాయపడగా వీరిలో పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే జిల్లా ఆ సుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Mera Ration Feature: రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

బస్సు ప్రమాదంలో ఎనిమిది రామచిలుకల మృతి
ఇదే ఘటనలో ప్రయాణీకులతో పాటు ఒక బుట్టలో కుక్కినట్లు వున్న 60 రామ చిలుకలు వుండగా ప్రమాద తరువాత ఈ బుట్ట దూరంగా ఎగిరిపడింది. ఈ ఘటనలో ఎనిమిది రామ చిలుకలు ఊపిరి ఆడక మరణించాయి. ఈ ఘటన తరువాత పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రామ చిలుకల బుట్టను వేరుచేసి సజీవంగా వున్న వాటికి మంచీనీరు తాగించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. గాయపడి ఎగురలేని రామ చిలుకలను స్థానిక పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. ఇవి కోలుకున్న తరువాత స్వేచ్చగా వదిలిపెడతామని అధికారులు తెలిపారు. రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు వేరుగా విచారణ చేబట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: