తాజాగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో చోటుచేసుకున్న విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. పెళ్లైన రెండు నెలలకే ఓ నవ వధువు భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
పూజిత కథ – ఆనందంగా మొదలై, అఘోరంగా ముగిసిన జీవితం
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఓ బంగారు నగర దుకాణంలో సేల్స్ మాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఖమ్మం జిల్లాకు చెందిన పూజితకి ఏప్రిల్ 16న వివాహం జరిగింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న శ్రీనివాస్ అనంతరం తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తన బంధువులతో కొన్నాళ్ల క్రితం పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియో చూపిస్తూ శ్రీనివాస్ నిత్యం వేధించేవాడు.

అదనపు కట్నం కోసం వేధింపులు
పెళ్లైన రెండు నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. పూజిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజిత భర్త శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. పెళ్లికి 11 లక్షలు ఖర్చు చేయడంతోపాటు కట్నకానుకలు ఇచ్చామని ఆ తర్వాత 10 లక్షలు కావాలని అత్తింటి వారితోపాటు భర్త వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత ఇస్తామని హామీఇచ్చినప్పటికీ వేధించారని పేర్కొన్నారు.
ఆఖరి శ్వాస కూడా ఒంటరిగా
ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె మృతదేహాన్ని చూసిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణ, నిందితులపై చర్యలు
పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Read also: Girl: బాలికను వీడియో కాల్లో వేధించిన బాలుడు – 8 మందిపై POCSO కేసు