తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో(Municipal elections) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంపై వారి మధ్య చర్చ జరిగింది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
Read Also: Vaddepally Municipality Controversy: మాకు జాగృతికి సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీనివాస్

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే (Municipal elections) ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో సమావేశమైన రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని, ఆ నమ్మకమే ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు.
కాంగ్రెస్ విజయంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందిస్తూ, రెండున్నరేళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమే గెలుపుకు కారణమని అన్నారు. పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో శ్రమించి విజయాన్ని సాధించారని అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: