Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

Read Time:  1 min
Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!
FONT SIZE
GET APP

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) ప్రభావంతో ఇప్పటివరకు నిలిచిపోయిన పన్నుల బకాయిలు ఒక్కసారిగా వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి రావడంతో, పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులు తదితర బకాయిలను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also:SBI ATM: కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

నిజామాబాద్‌లో భారీగా ఆస్తి పన్ను చెల్లింపు

నిజామాబాద్ మున్సిపాలిటీ(Municipal Elections) 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శమంత నరేందర్, తనకు చెందిన వంశీ హోటల్‌కు సంబంధించిన బకాయిలుగా సుమారు రూ.7.50 కోట్ల ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ చెల్లింపు మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Municipal Elections
Municipal Elections: Outstanding dues to be collected with a ‘No Dues’ certificate!

రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు మించి పన్నుల రూపంలో వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కారణంగా ఆర్థిక వసూళ్లు పెరగడం స్థానిక సంస్థలకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.