మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు (Municipal elections) వెలువడిన వెంటనే రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఏ ఒక్క పార్టీకీ మేయర్ పదవికి కావాల్సిన పూర్తి మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీఆర్ఎస్ (BRS) ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read Also: Cpi mayor race : కొత్తగూడెం మేయర్ పోరు వేడెక్కింది, కేటీఆర్ మద్దతు!

రాంబాబు అదృశ్యంపై కేసు నమోదు
(Municipal elections) శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 32వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన గుగులోతు రాంబాబు అదృశ్యమయ్యారు. కాంగ్రెస్ నాయకులే రాంబాబును బలవంతంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. రాంబాబు భార్య నాగమణితో కలిసి ఆయన నివాసం వద్ద ధర్నాకు దిగారు. అధికార పార్టీ అండతోనే ఈ కిడ్నాప్ జరిగిందని, తమ కార్పొరేటర్ను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
60 స్థానాల కార్పొరేషన్లో మేయర్కు 31 మంది మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22, బీఆర్ఎస్ 8, స్వతంత్రులు 6, బీజేపీ 1 సీటు గెలవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక జరగనుండగా సభ్యులను కాపాడుకునేందుకు పార్టీల క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. సీపీఐకి మేయర్ పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు మారాయి. రాంబాబు అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: