స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం కైవసం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 24 వార్డుల ఎన్నికల్లో ఫలితాలు (Municipal Election Results) వెలువడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), స్వతంత్ర అభ్యర్థులు నేరుగా పోటీ చేసి తమ స్థానాలను ఖరారు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సి పాలొటీలో వివిద వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులు ఇలా ఉన్నారు.
Read Also: Adilabad Municipal Election Results: అదిలాబాద్లో బీజేపీ జోరు

13స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం
(Municipal Election Results) మెదటి వార్డులో ముత్యాల శ్యామల భాస్కర్ (బీజేపీ), రెండవ వార్డులో నీళ్ల భాను బాబు గౌడ్ (కాంగ్రెస్), మూడవ వార్డులో దాసరి మురళీకృష్ణ (స్వతంత్ర అభ్యర్థి), నాల్గొవ వార్డులో కొండ్రు ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్), ఐదవ వార్డులో జెర్కొని మమత రాజు -ముదిరాజ్ (బీఆర్ఎస్), ఆరవ వార్డులో అమినా బేగం (కాంగ్రెస్), ఏడవ వార్డులోన టేకుల సుదర్శన్ రెడ్డి (బీఆర్ఎస్), ఎనిమిదవ వార్డులో వర్త్య రాందాస్ (కాంగ్రెస్), తొమ్మిదవ వార్డులో దారు రాఘవేంద్రర్ రావు (కాంగ్రెస్), పదవ వార్డులో దొంతరమోని భార్గవిరాజు ముదిరాజ్ (కాంగ్రెస్), 11వ వార్డులో కొండ్రు శ్రీలత రాంబాబు (బీఆర్ఎస్), 12వ వార్డులో కొండిగారి త్రిలోక్ (బీఆర్ఎస్), 13వ వార్డులో ఇందూరి శ్రీనివాస్ (కాంగ్రెస్), 14వ వార్డులో ఏదుల విజయలక్ష్మి జంగారెడ్డి (కాంగ్రెస్), 15వ వార్డులో క్యామ్ శంకర్ (బీఆర్ఎస్), 16వ వార్డులో అల్వాల -జ్యోతి వెంకటరెడ్డి (బీఆర్ఎస్), 17వ వార్డులో మడువు లక్ష్మమ్మ (బీఆర్ఎస్), 18వ వార్డులో సిద్ధం భానుప్రియ (బిజెపి), 19వ వార్డులో ఆకుల యాదగిరి (బీఆర్ఎస్), 20వ వార్డులో మంద జయ (బీఆర్ఎస్), 21వ వార్డులో చిలకల బుగ్గ రాములు (బీఆర్ఎస్), 22వ వార్డులో కప్పరి స్రవంతి చందు (కాంగ్రెస్), 23వ వార్డులో నీలం శ్వేత (బీఆర్ఎస్), 24వ వార్డులో గూడూరి గిరి (బీఆర్ఎస్) గెలుపొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: