తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల (Municipal Election Results) శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ (Congress) పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ హవా కొనసాగిందనే చెప్పాలి.
Read Also: Summer: అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. (Municipal Election Results) జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బోధన్ మున్సిపాలిటీ(38)లో కాంగ్రెస్ పార్టీ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ(36)లో కాంగ్రెస్ పార్టీ 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. భీమ్గల్ మున్సిపాలిటీ(12)లో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ మూడు మున్సిపాలిటీలు కూడా హస్తగతమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: