हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Breaking News – Matta Ragamayee : వరదనీటిని పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి

Sudheer
Breaking News – Matta Ragamayee : వరదనీటిని పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితిని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి (Matta Ragamayee) స్వయంగా పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు డా. దయానందాతో కలిసి జోరు వర్షంలోనూ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని ఆమె హెచ్చరించారు.

జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

సత్తుపల్లి మండలంలోని జాతీయ రహదారి 365BBపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిష్టారం వై జంక్షన్ వద్ద కిష్టారం చెరువు పొంగి రహదారిపైకి నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి వరద ప్రవాహాన్ని పరిశీలించి నీటిని మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు. ఇదే కాకుండా కిష్టారం నుంచి చెరుకుపల్లి, యాతాలకుంట గ్రామాల మధ్య ఉన్న రహదారులు కూడా వరదనీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్‌లో 98mm, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లో 160mm వర్షపాతం నమోదైంది. భారీగా వరదనీరు గనుల్లోకి చేరడంతో జేవీఆర్, కిష్టారం ఓసీలలో దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా, 2,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి. ఈ వర్షాల కారణంగా సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది.

https://vaartha.com/live-news-todays-latest-news-28-08-2025/live-news/536871/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870