हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Congress : గాంధీభవన్‌లో కులగణనపై సంబరాలు

Digital
Congress : గాంధీభవన్‌లో కులగణనపై సంబరాలు

Congress : కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని తీసుకున్న కీలక నిర్ణయం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్ గాంధీభవన్‌ ఈ సంధర్భంగా జశ్న్ వేదికగా మారింది. గురువారం ఉదయం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో యాదవులు గాంధీభవన్‌లో సమావేశమై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కేంద్రం అనుసరణగా ఈ నిర్ణయం తీసుకుందంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.కులగణనను స్వాగతిస్తూ మధ్యాహ్నం ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నేతృత్వంలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వలన కేంద్రం వత్తిడి తట్టుకోలేక కులగణనకు అంగీకరించాల్సి వచ్చింది,” అని పేర్కొన్నారు.

 Congress
Congress : గాంధీభవన్‌లో కులగణనపై సంబరాలు

Congress : గాంధీభవన్‌లో రాహుల్ చిత్రపటానికి పాలాభిషేకం, టపాసులతో సంబరాలు

కులగణన ద్వారా బీసీలకు 50 శాతం పైగా ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకుని విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోలకూ పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా “రాహుల్ గాంధీ జిందాబాద్”, “రేవంత్ రెడ్డి జిందాబాద్” నినాదాలతో గాంధీభవన్ ప్రాంగణం మార్మోగింది. మొత్తం గాంధీభవన్‌లో పండుగ వాతావరణం నెలకొనింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కులగణన దేశవ్యాప్తంగా కొనసాగాలన్న డిమాండ్‌తో పార్టీ శ్రేణులు ప్రగాఢ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాయి.

Read More : Terrorism : ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870