KTR complaint Governo : సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రాజ్భవన్కు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సింగరేణిలో జరిగిన అవకతవకలను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఫుట్బాల్ ఆట పేరుతో సింగరేణి నిధుల నుంచి రూ.10 కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సింగరేణి టెండర్లలో పూర్తిగా పారదర్శకత లేకపోయిందని, ఈ అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
సింగరేణి వ్యవహారంలో కీలక వ్యక్తిగా చెబుతున్న (KTR complaint Governo) సృజన్ రెడ్డి ముఖ్యమంత్రికి బావమరిదేనా కాదా స్పష్టత ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి గురించి సింగరేణి కార్మికులు ‘కోల్ మాఫియా నాయకుడు’గా భావించే పరిస్థితి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకుని న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.

ఇదే సందర్భంలో హిల్ట్ పాలసీపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో ఉన్న సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకునే ఇలాంటి చర్యలను తక్షణమే అడ్డుకోవాలని గవర్నర్ను కోరామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: