తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో అత్యంత ప్రాముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేల అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం ఉంది. అయితే, ఈ పదవిని పాత నేతలకే కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కేసీఆర్ భేటీ
ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్),హరీశ్ రావు కూడా హాజరుకానున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయాన్ని గనుక పరిశీలిస్తే, గతంలో కొనసాగిన సభ్యుడికి మరో అవకాశం ఇస్తారా లేదా కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తే, బీఆర్ఎస్ నాయకత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనుభవజ్ఞులకే ప్రాధాన్యత ఇస్తుందా అనే ప్రశ్నకు ఈ సమావేశం అనంతరం స్పష్టత రానుంది.ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను కేసీఆర్ నేతలకు సూచించే అవకాశం ఉంది.

ఇటీవల రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ తన స్థానాన్ని బలంగా నిలుపుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో, పార్టీకి అవసరమైన మార్పులు, భవిష్యత్తు వ్యూహాలు, అధికార పార్టీని ఎదుర్కొనే విధానంపై కీలకమైన సూచనలు ఈ సమావేశంలో వచ్చే అవకాశముంది.సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు, పార్టీకి కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి, ప్రతి వారంలో ఒక రోజు, ఒకటి లేదా రెండు నియోజకవర్గాలకు చెందిన 200 మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఇవాళ్టి సమావేశంలో, పార్టీ బలోపేతం, ప్రజలకు చేరువ కావడం, నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అలాగే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.సంఖ్యా బలం ప్రకారం, బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది. ఈ సీటు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, సీనియార్టీ, విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.