
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో ఇస్సార్ (Hisar) ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి ఇస్సార్ వెళ్తున్న ఈ రైలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఇంజిన్కు సంబంధించిన ఒక చక్రం (Wheel) అకస్మాత్తుగా విరిగిపోవడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. అప్రమత్తతతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. రైల్వే అధికారులు మరో ఇంజిన్ను తీసుకువచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: Jagruthi meeting : ఏప్రిల్ ఇరవై నాలుగున జాగృతి కీలక సమావేశం, కొత్త పార్టీ?
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: