हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

Vanipushpa
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌( KCR)కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghose) నేతృత్వంలోని కమిషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌తో పాటు, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు(Harishrao), బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్‌(Etala Rajendar) కు కూడా కమిషన్ నోటీసులు పంపింది.
15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించింది. ఇందుకోసం నిర్దిష్ట తేదీలను కూడా కమిషన్ ఖరారు చేసింది. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ తన నోటీసులో స్పష్టం చేసింది. అలాగే, కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్ రావు జూన్ 6వ తేదీన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కమిషన్ పేర్కొంది.

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ తో సహా బడానాయకులకు నోటీసులు!

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో..
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కూడా విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటి పారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి తగిన విధంగా కమిషన్ గడువును ఏడుమార్లు పొడిగించింది.

Read Also: Jyothirmayi: ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి ప్రసవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870