Jayashankar Telangana Agricultural University: గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ జిష్ణుదేవవర్మ (Jishnu Dev Varma)ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం విశ్వ విద్యాలయం విసి ప్రొ. అల్దాస్ జానయ్య, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సీ హెచ్.విద్యాసాగర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎం.మల్లారెడ్డిలతో కలిసి సోమవారం లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పీజెటీఎయూ ప్రగతి నివేదికను గవర్నర్ విడుదల చేశారు.
Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

పీజేటీఎయూ విజయాలకు గవర్నర్ ప్రశంసలు
పీజెటీఎయూ సాధిస్తున్న ప్రగతిని గవర్నర్ అభినందించారు. ప్రవేశాల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించడాన్ని గవర్నర్ ప్రశంసించారు. అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకుల్లో పీజెటీఎయూ 37వ ర్యాంకు నుండి 24 వ స్థానానికి ఎగ బాకడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ష్యత్తులోనూ మంచి పనితీరు స్ఫూర్తితో భవి కనపరచాలని, అత్యుత్తమ ర్యాంకులు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న మూడు బ్యాచ్లకు కలిపి ఒకే స్నాత కోత్సవాన్ని ఫిబ్రవరి 2026 నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అల్టాస్ జానయ్య చేసిన విజ్ఞప్తిని గవర్నర్, ఛాన్స్ లర్ అంగీకరించారు. త్వరలోనే స్నాతకోత్సవం తేదీల్ని ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. 2026 ఫిబ్రవరిలో మూడు బ్యాచ్లకు చెందిన 2,800 యూజి, పీజీ, పీహెచ్ విద్యార్థులకు గవర్నర్, ఛాన్స్ లర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నట్లు అల్టాస్ జానయ్య తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: