అనుమానం అనే భావన ఒక్కసారిగా మనిషిని ఎంతటి మృగంగా మార్చేస్తుందో మరోసారి రుజువైంది. తాళి కట్టిన భార్యనే ఓ వ్యక్తి, అత్యంత పాశవికంగా ఆమె ప్రాణాలు తీసిన ఘటన జగిత్యాల (Jagityala) జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లయ్యకు కొంతకాలంగా తన భార్యపై అనుమానం మొదలైంది. ఈ విషయంపై తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్తున్నారు. చివరకు శనివారం (ఫిబ్రవరి 07) తెల్లవారు జామున 2 గంటల సమయంలో భార్య సత్తవ్వను దారుణంగా హత్య చేశాడు మల్లయ్య.
Read Also: HYD Crime: అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు మృతి
కేసు నమోదు
అనుమానంతో భార్య సత్తవ్వపై కసి పెంచుకున్న మల్లయ్య శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో గొంతు కోసి, గొడ్డలితో దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రైవేట్ పార్టులో కర్ర పెట్టి చిత్రహింసలకు గురి చేసిన నిందితుడు, ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత పరార్ అయ్యాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సత్తవ్వ హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. అనుమానంతో భార్యను చంపిన విషయం తెలిసిన గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు సద్దుమణిగకపోవడం వల్లే హత్య చేసే వరకూ చేరుకుందని తెలుస్తోంది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: