हिन्दी | Epaper

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం.. మహేష్ కుమార్

sumalatha chinthakayala
బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం.. మహేష్ కుమార్

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కేంద్ర బడ్జెట్‌ పై స్పందించారు. తెలుగు మహిళ అయిన నిర్మలా సీత రామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు..కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం అని ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని అన్నారు.

image

ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరణాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయలని చూస్తుందని ఫైర్‌ అయ్యారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని తెలిపారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870