हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు బోధన్‌లో 3,500 మంది పేదలకు

Sai Kiran
Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు బోధన్‌లో 3,500 మంది పేదలకు

Indiramma Illu : బోధన్‌ నియోజకవర్గంలో 3,500 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని కాంగ్రెస్‌ పీసీసీ డెలిగేట్‌ గంగాశంకర్‌ తెలిపారు. (Indiramma Illu) ఆదివారం పట్టణంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి మాజీ ఎమ్మెల్యే షకీల్‌ చేసిన ఆరోపణలను ఖండించారు.

గంగాశంకర్‌ మాట్లాడుతూ – “గత ప్రభుత్వ కాలంలో బోధన్‌లో ఇసుక అక్రమ రవాణా విస్తృతంగా జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మేము డీడీలు చెల్లించి సరైన విధంగా సప్లయ్‌ అందిస్తున్నాం,” అన్నారు.

Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి

ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిపై షకీల్‌ చేసిన విమర్శలను గంగాశంకర్‌ తిప్పికొట్టారు. “ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి ముంపు పంటలను సర్వే చేయించి రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్‌ మాత్రం ప్రజల వద్దకు కూడా రాకుండా ఆరోపణలు చేయడం తగదు,” అని అన్నారు.

అలాగే ఆయన చెప్పారు – “ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, ఉచిత కరెంట్‌ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇవన్నీ కనిపించక షకీల్‌ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.”

బీఆర్‌ఎస్‌కి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల కాంగ్రెస్‌పై కిడ్నాప్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని గంగాశంకర్‌ అన్నారు. “ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు. అందుకే ప్రతి గ్రామంలో పేదలకు ఇండ్లు మంజూరు అవుతున్నాయి,” అని తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ నాయకులు నాగేశ్వరరావు, మందర్నా రవి, పాషా మోయినొద్దీన్‌, శరత్‌ రెడ్డి, గణపతిరెడ్డి, తలారి నవీన్‌, దామోదర్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870