हिन्दी | Epaper

Indiramma houses scheme : కారు ఉన్నందుకే ఇల్లు లేదు? ఇందిరమ్మ పథకంలో కొత్త ట్విస్ట్!

Sai Kiran
Indiramma houses scheme : కారు ఉన్నందుకే ఇల్లు లేదు? ఇందిరమ్మ పథకంలో కొత్త ట్విస్ట్!

Indiramma houses scheme : ఉపాధి కోసం కొనుగోలు చేసిన కారు ఇప్పుడు సొంతింటి కలకు అడ్డంకిగా మారుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం కింద కార్లు కొనుగోలు చేసి క్యాబ్‌ డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్న పలువురు, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులుగా మారిపోతున్నారు. సొంతిల్లు లేని నిరుపేద కుటుంబాలైనా, వారి పేరులో కారు ఉండటమే ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభ సమయంలో అర్హతలు, అనర్హతలపై పూర్తి స్పష్టత లేకపోవడంతో ఈ గందరగోళం తలెత్తింది. ముఖ్యంగా క్యాబ్‌ డ్రైవర్ల విషయంలో సమస్య తీవ్రంగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో క్యాబ్‌ సేవలు వేలాది మందికి ఉపాధిగా మారాయి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో, గతంలో దళితబంధు ఆర్థిక (Indiramma houses scheme) సాయంతో కార్లు కొనుగోలు చేసిన యువకులు క్యాబ్‌ డ్రైవింగ్ వైపు మళ్లారు. అప్పట్లో నిరుపేదలుగా అర్హత పొందిన వారే, ఇప్పుడు ‘కారు ఉంది’ అన్న కారణంతో ఇందిరమ్మ పథకానికి అనర్హులవడం చర్చనీయాంశంగా మారింది.

నిబంధనే అడ్డంకి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ‘సొంత కారు ఉండకూడదు’ అనే నిబంధన ఉంది. కారు కొనగలిగే స్థోమత ఉంటే నిరుపేద కాదన్న ఉద్దేశంతో ఈ షరతును చేర్చారు. కానీ జీవనోపాధి కోసం క్యాబ్‌ నడిపే వారిని కూడా ఇదే కోవలోకి తీసుకోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరులో కారు ఉండటం వల్ల కూడా చాలామంది అనర్హులయ్యారు.

Read Also: Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక మంది క్యాబ్‌ డ్రైవర్ల పేదరిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు మొదట అర్హులుగా గుర్తించారు. ఫలితంగా వారికి ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం కూడా ప్రారంభమైంది. అయితే బిల్లుల చెల్లింపుల సమయంలో ఆధార్‌ వెరిఫికేషన్‌లో కారు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. ఒకసారి అర్హులుగా గుర్తించి, ఇళ్లు మంజూరు చేసిన తర్వాత మళ్లీ అనర్హులుగా ప్రకటించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయించగా, క్యాబ్‌ డ్రైవర్లను అర్హులుగా పరిగణించాలంటూ వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870