हिन्दी | Epaper

Ponds : చెరువులను చెరబడితే తాట తీస్తా – సీఎం రేవంత్ రెడ్డి

Sudheer
Ponds : చెరువులను చెరబడితే తాట తీస్తా – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) చెరువులు, నాలాల కబ్జాలపై కఠిన వైఖరి ఎత్తుకున్నారు. “చెరువులను చెరబెట్టేవారికి తాట తీస్తాం” అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. రాష్ట్రంలో చెరువులు, నదులు, నాలాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ క్రమంలో మూసీ పునరుద్ధరణ కీలక లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. హైదరాబాదుకు ప్రాణాధారమైన మూసీ ఒకప్పుడు పుష్కలంగా ప్రవహించే నది కాగా, నేడు మురికితో నిండిన కూపంగా మారిపోవడం బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు.

మూసీ పునరుద్ధరణతో పాటు చెరువులు, కుంటల కబ్జాలను తొలగించడం, మురుగు నీటి సమస్యలను పరిష్కరించడం, నదులలో సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై ప్రభుత్వం కఠినంగా పనిచేస్తోంది. “ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుందని చరిత్ర చెబుతోంది” అని సీఎం పేర్కొన్నారు. నదులను శుభ్రం చేయడం, చెరువులను పునరుద్ధరించడం కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలకు కూడా అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

News telugu: Thaman-గేమ్ చేంజర్ వివాదంపై స్పందించిన తమన్

మూసీ శుభ్రత, చెరువుల రక్షణ కేవలం ప్రభుత్వంతోనే సాధ్యంకాదు; ప్రజల సహకారం తప్పనిసరి. పచ్చని పర్యావరణం, స్వచ్ఛమైన నీటి వనరులు ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలకు ప్రతి పౌరుడు తోడ్పాటు అందించాలని, కబ్జాలు, కాలుష్యానికి వ్యతిరేకంగా ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విధంగా నదులు, చెరువులు పునరుజ్జీవనం పొందితే తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870