Ibrahimpatnam Politics: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పూర్తిగా అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జరగాల్సిన ఎన్నికను కాంగ్రెస్ సభ్యులు గలాటా చేసి వాయిదా వేయించడం సరైన చర్య కాదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, ఎన్నికను నిరోధించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను హత్య చేశారని ఆరోపించారు.
Read also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

మున్సిపల్ పీఠం చివరకు బీఆర్ఎస్ పార్టీదే
స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మెప్పు కోసమే పోలీసులు, అధికారులు కలిసి ఎన్నికను వాయిదా వేయించినట్లు ఆయన ఆరోపించారు.ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం చివరకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)దే అవుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యుడు ఆకుల యాదగిరి సమావేశానికి గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీకి కలిగిన నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఈ అంశంపై తాము జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వేచ్ఛగా, ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: