Ibrahimpatnam, మార్చి 3, ప్రభాతవార్త : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విద్యుత్ కార్యాలయానికి సంబంధించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర జై భీమ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సరూర్ నగర్ సర్కిల్ ఎస్.ఈ లక్ష్మీనారాయణకు అసోసియేషన్ ప్రతినిధులు డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్
సంఘం వ్యవస్థాపకులు,జనరల్ సెక్రెటరీ మాతంగి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సరూర్ నగర్ సర్కిల్ కార్యదర్శి పి. రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ సర్కిల్ కార్యదర్శి పి. రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్కిల్ ప్రెసిడెంట్ పి. ప్రవీణ్ కుమార్, అసోసియేషన్ ముఖ్య నాయకులు కె. మహేందర్, బి. అశోక్, సిహెచ్. ప్రకాష్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: