Hyderabad Metro: ప్రయాణికులు తాజాగా ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. స్టేషన్లోకి ప్రవేశించిన సమయం నుంచి బయటకు వచ్చే వరకు రెండు గంటలు దాటితే అదనపు ఛార్జీలు పడుతున్నాయి. ఈ నిబంధన గురించి చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల, ప్రయాణం తక్కువైనా, మొత్తం స్టేషన్లో గడిపిన సమయం పెరిగితే ఫైన్ విధింపబడుతోంది. దీంతో అకారణంగా డబ్బులు కోల్పోతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.
JNTU: ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

Shock for metro
టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 30 నిమిషాల్లోపే
ప్రస్తుతం మెట్రో (Hyderabad Metro) టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 30 నిమిషాల్లోపే స్టేషన్లోకి ప్రవేశించాలి. తర్వాత గరిష్టంగా 120 నిమిషాల్లో స్టేషన్ నుంచి బయటకు రావాలి. ఈ సమయాన్ని దాటితే వ్యవస్థ ఆటోమేటిక్గా అదనపు ఛార్జీలు జోడిస్తుంది. ముఖ్యంగా జేబీఎస్ఎం జీబీఎస్ కారిడార్లో రైళ్ల ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటం వల్ల, రైళ్లు మిస్ అయితే ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ఛేంజ్ స్టేషన్లు మారడానికి పట్టే అదనపు సమయం కూడా ఈ సమస్యను మరింత తీవ్రమైంది చేస్తోంది.
Hyderabad Metro: మెట్రో స్టేషన్లలో ఫుడ్ కోర్టులు, మినీ షాపింగ్ జోన్లు ఏర్పాటు చేసి, మరోవైపు సమయ పరిమితిని కఠినంగా అమలు చేయడం ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. షాపింగ్ లేదా భోజనం చేసినా రెండు గంటలు దాటిపోవడం సహజమే కాబట్టి, సమయ పరిమితిని పెంచాలని ప్రయాణికులు మెట్రో అధికారులను కోరుతున్నారు. వ్యవస్థాపక సమస్యల వల్ల ఆలస్యం అయితే ప్రయాణికులపై భారం మోపడం అన్యాయమని వారు అంటున్నారు.
మెట్రోలో సమయం దాటితే ఎందుకు ఫైన్ పడుతోంది?
స్టేషన్లో గడిపే గరిష్ట సమయాన్ని 120 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ సమయం దాటితే వ్యవస్థ అదనపు ఛార్జీలు జోడిస్తుంది.
ఎందుకు ఎక్కువమంది ఫైన్ పడుతున్నారు?
ఈ నిబంధన గురించి అవగాహన లేకపోవడం, రైళ్ల తక్కువ ఫ్రీక్వెన్సీ, ఇంటర్ఛేంజ్ స్టేషన్లలో ఆలస్యాలు కారణం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :