हिन्दी | Epaper

Metro Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

sumalatha chinthakayala
Metro Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

Metro Charges : హైదరాబాదులో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్‌ షాక్‌ అని చెప్పాలి. మెట్రో ఛార్జీలు పెంపకం తథ్యమని తెలుస్తోంది. అతి త్వరలోనే మెట్రో ధరలో పెంపునకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. దాదాపు 50 శాతం పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు పెంచే యోచనలో ఉంది. అది ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీ

ఇప్పటికే మెట్రో రూ.59 హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది. రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. మెట్రో ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎల్ అండ్ టి. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు .

మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది

కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44 శాతం పెరిగాయి హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది.

మెట్రోలో మాత్రం 50% మేరకు ఛార్జీలు పెరిగే అవకాశం

2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రజలకు సేవలు అందిస్తూ వస్తుంది. అయితే రూ.6500 కోట్లకు మెట్రో రైల్ నష్టాలు చేరాయి అని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారస్థాయికి చేరడంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదు. కొత్త వాటిని కొనుగోళ్లకు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని దానికి ఈ చార్జీలు పెంపక తప్పడం లేదు. అయితే హైదరాబాద్ మెట్రోలో మాత్రం 50% మేరకు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read Also: నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

📢 For Advertisement Booking: 98481 12870