Hyderabad Gas Shortage: పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావం ఇప్పుడు హైదరాబాద్లోని సామాన్యుడి కడుపుపై పడుతోంది. అంతర్జాతీయంగా చమురు మరియు సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా నగరంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. దీని ఫలితంగా హైదరాబాద్లోని ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలోని హోటళ్లు, హాస్టళ్లు మరియు మెస్లు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Read Also :Gas Shortage : గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

మెనూలో మార్పులు – పెరిగిన ధరలు
గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే టీ, కాఫీ, చపాతీ, దోశ మరియు పూరి వంటి వంటకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. వండేందుకు ఎక్కువ సమయం మరియు నూనె అవసరమయ్యే పదార్థాలను పక్కన పెట్టి, కేవలం అన్నం, పప్పు, సాంబార్ వంటి తక్కువ సమయంలో తయారయ్యే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రవాణా ఖర్చులు భారం కావడంతో పెద్ద హోటళ్లలో టిఫిన్ ధరలు రూ. 10 నుండి రూ. 15 వరకు పెరిగాయి.
హాస్టళ్లపై తీవ్ర ప్రభావం
నగరంలోని పీజీ హాస్టళ్లు మరియు మెస్ నిర్వాహకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఇలాగే కొనసాగితే, మరో రెండు మూడు రోజుల్లో హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం రసం, పప్పు వంటి సాధారణ భోజనం మాత్రమే వడ్డిస్తూ పరిస్థితిని నెట్టుకొస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :