Hyderabad: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, అత్యంత రద్దీగా ఉండే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం వ్యయం: రూ. 940 కోట్లు, పొడవు: సుమారు 6 కిలోమీటర్లు.
నిర్మాణ శైలి: ఇది మూడు అంచెలుగా ఉంటుంది. పైన మెట్రో రైలు మార్గం, మధ్యలో జాతీయ రహదారి (National Highway), కింద స్థానిక వాహనాల కోసం వెహికిల్ అండర్ పాస్లు (VUP) ఉంటాయి. ప్రభుత్వ వాటా ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇప్పటికే రూ. 200 కోట్లు కేటాయించింది.
Read Also : Oil Palm Factory Inauguration: పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

హయత్ నగర్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హయత్ నగర్ సాయిబాబా ఆలయం (తొర్రూర్ ఎక్స్ రోడ్) నుంచి జీ స్కూల్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. విస్తరణ ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న ఈ రహదారిని రూ. 10 కోట్లతో 4 లేన్లుగా విస్తరించనున్నారు. ఈ విస్తరణ వల్ల విజయవాడ హైవే వైపు వెళ్లే ప్రయాణికులకు, స్థానిక కాలనీల వాసులకు ట్రాఫిక్ సమస్య తప్పుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై-పూణే నగరాలను కలుపుతూ 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఇదే ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతం నుంచే రానున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో హయత్ నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కోకాపేట లాగా మారే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 లేన్ల రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :