हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

న్యూ ఇయర్ సందర్బంగా ఖమ్మం జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు..!

Sudheer
న్యూ ఇయర్ సందర్బంగా ఖమ్మం జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు..!

న్యూ ఇయర్ వేడుకలు ఖమ్మం జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలకు దారితీశాయి. డిసెంబర్ 30, 31 తేదీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. 208 మద్యం దుకాణాల్లో మొత్తం రూ.42 కోట్ల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో మద్యం విక్రయాలు రోజుకు రూ.5 కోట్ల వరకు మాత్రమే ఉంటాయి. కానీ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగింది.

ఈ సందర్భంగా బీర్లు 11,924 కేసులు, అలాగే విస్కీ, బ్రాందీ వంటి ఇతర మద్యం బ్రాండ్ల బాటిళ్లు 29,979 కేసులు అమ్ముడైనట్లు సమాచారం. ప్రతి సంవత్సరంలోనూ న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాలు సాధారణ దినాలతో పోల్చితే మూడింతల నుంచి నాలుగింతల వరకు పెరుగుతాయి. ఈసారి అదే ట్రెండ్‌ను ఖమ్మం జిల్లాలో కూడా చూసాం.

డిసెంబర్ 31 నాటికి మద్యం విక్రయాల ద్వారా రూ.42 కోట్ల ఆదాయం నమోదైనట్టు తెలుస్తోంది. ఇది మునుపటి రికార్డులను మించిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న వినియోగం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చిందని అంచనా. మద్యం అమ్మకాల్లో ఇంత భారీ పెరుగుదల సంక్రాంతి పండుగకు కూడా కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మద్యం వినియోగం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది. అయితే మద్యం విక్రయాలు, వినియోగం పెరగడం ఆరోగ్యానికి, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, పండుగలు మద్యం వినియోగానికి మౌలిక కారణాలుగా మారడం ఆందోళన కలిగించకమానదు. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మద్యం విక్రయాలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870