రేవంత్ సర్కార్పై హరీష్రావు తీవ్ర విమర్శలు
గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Koushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్(Hyderabad)లోని శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో అదుపులోకి తీసుకున్న సుబేదారి పోలీసులు, అనంతరం వరంగల్కు తరలించారు. ఈ అరెస్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కౌశిక్రెడ్డిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దొంగ కేసు బనాయించి, ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్(Harish) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, నిద్రలో కూడా ఆయన పేరే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ రేసును రాష్ట్రానికి తీసుకొచ్చిన కేటీఆర్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం సతాస్తోందని మండిపడ్డారు. శని, ఆదివారాల్లో అరెస్టులు చేయవద్దని హైకోర్టు పలుమార్లు చెప్పినా, కౌశిక్రెడ్డి విషయంలో పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం సీఎం కుర్చీ విలువను కూడా తీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి ధర్నాలో హరీష్ వ్యాఖ్యలు
జిన్నారం, పటాన్ చెరు నియోజకవర్గ రైతుల కోసం ధర్నాలో పాల్గొన్న హరీష్,
“రైతులకు వెంటనే రైతు భరోసా అందించాలి” అని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌశిక్ రెడ్డి అరెస్టును పోలిటికల్ టార్గెట్గా బీఆర్ఎస్ చూస్తోంది.కాంగ్రెస్-బీఆర్ఎస్ పరస్పర దాడులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ తెలంగాణలో రైతుల ఆందోళన, రేషన్ సమస్యల నేపథ్యంలో హరీష్ రావు రైతు కార్డు మళ్లీ పట్టేశారు.
Read Also: KTR: గిరిజన మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్