हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

తెలంగాణలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్

Sudheer
తెలంగాణలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రైవేట్ రంగంలో రాకెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రం, అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపును సాధించబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, స్కైరూట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్కైరూట్ సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ప్రపంచ స్థాయిలో ఉత్తమ రాకెట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు.

హైదరాబాద్‌ను సాంకేతికత మరియు పరిశోధన రంగంలో ముఖ్య కేంద్రముగా అభివృద్ధి చేయడంలో స్కైరూట్ ఏరోస్పేస్ కీలకపాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్కైరూట్ కంపెనీ ఇప్పటికే భారతదేశం తొలి ప్రైవేట్ రాకెట్ “విక్రమ్-ఎస్” విజయవంతంగా నింగిలోకి పంపి ప్రతిభను చాటింది. ఈ నూతన యూనిట్ ద్వారా ఆ సంస్థ మరింత ఆధునిక రాకెట్లను తయారు చేయనుంది. రాకెట్ తయారీ, పరీక్షల ప్రక్రియలన్నీ తెలంగాణలోనే జరగడం గర్వకారణమని సీయం రేవంత్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇటు ఐటీ రంగం, అటు అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతున్న తరుణంలో, స్కైరూట్ సంస్థతో ప్రభుత్వ భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870